గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో, ప్రత్తిపాడు ఒకటి. 19వ శతాబ్దిలోనే ఆంగ్ల విద్యాలయాలు నెలకొన్న ప్రాంతాలలో ఇది ఒకటి. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా పన్నుల నిరాకరణ ఉద్యమం, పెదనందిపాడు నుంచే మొదలయింది.
పూర్వం ఈ ప్రాంతాన్ని "భక్తులవాడ"గా పిలిచేవారని చరిత్ర కథనం. అనంతరం అది "భక్తిపాడు"గా మారిందని, ప్రత్తి పంట బాగా పండేది కనుక తొలుత "ప్రత్తిపాడు"గా మారిందని శాసనాలు చెపుతున్నాయి. ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 184820 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 92910 కాగా మగవారి సంఖ్య 91895. పొగాకు, మిరప మరియు పత్తి ఇక్కడి ప్రధాన పంటలు.
జాగర్లమూడి వీరాస్వామి (ఏ.పి.పి.ఎస్.సి. ఛైర్మన్, హేతువాది కులనిర్మూలన సంఘ అధ్యక్షుడు).