గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో, బాపట్ల ఒకటి. నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 171229 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 84323 కాగా ఆడవారి సంఖ్య 86895.
ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ప్రాంతానికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, తర్వాత బాపట్ల గా మారింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యేకం. చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం ఈ సెగ్మెంట్. మొట్టమొదటి ఆంద్ర మహాసభ జరిగింది ఇక్కడే. పత్తి మరియు మిరప ఇక్కడి ప్రధాన పంటలు.
శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం - స్థానిక ఎస్.ఎన్.పి.అగ్రహారంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో వైభవంగా నిర్వహించెదరు.
శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ క్షీరభావనారాయణస్వామివారి ఆలయం
సముద్రతీరం - బాపట్లకు సమీపంలోని సూర్యలంక వద్దనున్న బీచ్ సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడే భారత వాయుసేన వారి కేంద్రము కూడా ఉంది. ఇది బాపట్లకు 9 కి.మీ దూరంలో ఉన్న ఓడరేవు మరియు పర్యాటక కేంద్రము.
నేదురుమల్లి జనార్ధనరెడ్డి - డిసెంబర్ 17, 1990 నుండి అక్టోబర్ 9, 1992 వరకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేదురుమల్లి జనార్థన్ రెడ్డి 1998లో ఒకసారి ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు.
దగ్గుబాటి పురంధరేశ్వరి - ఎన్టీ రామారావు కుమారై అయిన ఈమె 14వ లోక్సభకు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. ఈమె ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మానవవనరుల శాఖా సహాయమంత్రిణిగా కొనసాగుతోంది.