ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మెళియాపుట్టి మండలం

మెళియాపుట్టి శ్రీకాకుళం జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన పర్లాకిమిడి (ఒరిస్సా) నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలం 12851 ఇళ్లతో, 52737 జనాభాతో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 25911, ఆడవారి సంఖ్య 26826. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3866 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 14908.

మెళియాపుట్టి గ్రామములో వున్న శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయం ఒక దర్శనీయ ప్రదేశము. ఈ గుడి జిల్లాలో రెండవ పెద్ద గుడి. ఈ గుడి పూరి జగన్నాధస్వామి గుడిని తలపిస్తుంది. ఈ గ్రామమునకు ఆనుకుని మహేంద్రతనయ నది ప్రవహిస్తుంది. గ్రామమునకు కొద్దిదూరమున ఇంజమ్మకొండ ఉంది. ఈ కొండపైన ఒక గుహవుంది. ఈ గుహలో కొన్ని దేవతామూర్తుల విగ్రహములు ఉన్నాయి.

తాగు నీరు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చాకాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

విద్యుత్తు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

  • మెళియాపుట్టిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
  • నీటిపారుదల సౌకర్యాలు
  • బావులు/బోరు బావులు: 10 హెక్టార్లు

సమస్యలు

గొప్పిలి గ్రామం లొత్తూరు వద్ద రిజర్వాయర్ నిర్మించాలి. 15 ఏళ్ళ క్రితం చేపట్టిన ఈ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. రెండున్నర కోట్ల రూపాయలతో ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించారు. ఇది పూర్తి చేస్తే 800 ఎకరాలకు సాగు నీరు అందుతుంది.

ఒడిషా రాష్ట్రం, పర్లాకిమిడి జిల్లాలోని కృష్ణసాగరం జలాశయంపై ఆంద్ర రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. జంగాలపాడు వద్ద ఛానల్ కు అడ్డంగా చెక్ డ్యామ్ ను ఒడిషా ప్రభుత్వం కట్టింది. దాని మరమ్మతుల సమయంలో 9 అంగుళాలు పెంచింది. దీంతో డ్యామ్ లో నీరు తక్కువ ఉన్నప్పుడు ఆంధ్రకు నీరు రావడం లేదు, మహేంద్ర తనయలోకి పోతోంది. సకాలంలో నీరు లేక 500 ఎకరాల సాగు భూమి నష్టపోతోంది. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

  • చుట్టూ కొండలున్న మండలం ఇది. వర్షాధారంమే అయినా నీరు నిల్వ చేస్తే సస్యశ్యామలమే.
  • బగడ సాగరం ( ఆఫ్ షోర్ ) వంద ఎకరాల గర్భం. పూడిక తీస్తే 1500 ఎకరాలకు నీరు అందుతుంది.
  • రహదారులు లేని ఎస్టీగ్రామాలు చాలా ఉన్నాయి
  • బస్ స్టేషన్ లేదు
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాలికల జూనియర్  కళాశాల అవసరం
  • విస్తరణలో అతి పెద్ద మండలం, రెండవ అతి పెద్ద గిరిజన మండలమైనా నేటికీ  నోటిఫైయిడ్ కాలేదు
  • మూడు బస్సులు మారితేనే సీతంపేట ఐటిడిఎకు చేరుకోగలం
  • రవాణా సౌకర్యం మెరుగుపరచాలి
  • ప్రజారోగ్యశాఖకు మంజూరైన పోస్టులను మైదాన ప్రాంతాలకు తీసుకు వెళ్లిపోతున్నారు.
  • దీని వల్ల వైద్యశాలలు అందడం లేదు
  • చిన్న చిన్న జలాశయాలు నిర్మిస్తే వ్యవసాయం, ఉద్యాన పంటలను విస్తారంగా పండించవచ్చు
  • పెద్ద పద్మపురం ఎత్తిపోతల పథకం 18 ఏళ్ళ క్రితం సర్వే చేశారు. అప్పట్లో పాతిక లక్షల బడ్జెట్ నేడది మూడు కోట్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తయితే 200 ఎకరాలకు నీరు అందుతుంది.
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి