ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మెంటాడ మండలం

మెంటాడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము

మండల కేంద్రంలో ఉన్న మెంటాడ శాఖ గ్రంథాలయం నిరుద్యోగులకు, పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తుంది. గ్రంథాలయంలో లభ్యమవుతున్న పుస్తకాలవల్ల పలువురు లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ వృద్ధులకు సంపూర్ణ రామాయణం, భారతం, పెదబాలశిక్ష తదితర ఎన్నో విలువైన గ్రంథాలు ఉన్నాయి. వీటిని ఇంటికి తీసుకువెళ్లి వృద్ధులు చదువుతూ ఉన్నారు. ఈ శాఖా గ్రంథాలయానికి మెంటాడ, ఆగురు, తమ్మరాజుపేట, గుర్ల , పిట్టాడ తదితర గ్రామాల నుండి రోజుకు 150-200 మంది పాఠకులు వస్తున్నారు. ఈ గ్రందాలయాన్ని వావిలాల గోపాల కృష్ణయ్య ప్రారంభించారు.ప్రస్తుతం అద్దె ఇండ్లలోగ్రంథాలయాలు నడుస్తున్నాయి. నిరుద్యోగ యువతకోసం ఎప్పడికప్పుడు పోటీ పరీక్షలకు పుస్తకాలు తెప్పిస్తున్నారు. రోజురోజుకు గ్రంధాలయాలనకు పాఠకుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయం అద్దె ఇంట్లో నిర్వహించడం వలన వసతి సమస్య తీవ్రంగా ఉంటుందని విద్యార్థులు, నిరుద్యోగులు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని చూసి కృష్ణం రాజు అనే వ్యక్తి గ్రంథాలయం ఏర్పాటుకు సరిపడ జిరాయితీ భూమిని సుమారు ఐదు సెంట్లును విరాళంగా ఇచ్చారు. స్థల సమస్య తీరడంతో భవనానికి చైర్మన్ రొంగలి పోతన్న ఆరు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించారు. భవన నిర్మాణానికి టెండర్లు కూడా పూర్తయ్యాయి. త్వరలో భవన నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. భవనం పూర్తి అయితే నిరుద్యోగులకు విద్యార్థులకు సమస్యలు తీరినట్లేనని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు భాష స్థానిక భాష. మెంటడ పట్టణం మొత్తం జనాభా 4977 మరియు ఇళ్ళు సంఖ్య 1181. స్త్రీ జనాభా 50.0%. పట్టణ అక్షరాస్యత రేటు 52.4% మరియు స్త్రీ అక్షరాస్యత రేటు 21.2%.

సమస్యలు:

  • ఆంధ్ర జలాశయం వల్ల 8 గ్రామాలకే లబ్ధి చేకూరుతుంది. మిగిలిన గ్రామాలకు నీరు లేదు, ఆంధ్ర జలాశయాన్ని మెంటాడ, గజపతినగరం బొండపల్లి మండలాల్లో 9,800 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే ఉద్దేశ్యం నిర్మించారు. కేవలం ఐదు వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఆంధ్ర హై లెవెల్ కెనాల్ మిగులు జలాలను అనుబంధ కాలువల ద్వారా మూడు వేల ఎకరాలకు నీరు అందించాలి ఆ పని కూడా సగంలో నిలిచిపోయింది. సుమారు పాతిక లక్షల రూపాయలు పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి.
  • గొర్ల గడ్డ రిజర్వాయర్కు నాలుగు కోట్లతో మట్టి గట్టు కట్టారు. కెనాల్స్ నిలిచిపోయాయి. ఇంకా సుమారు కోటి రూపాయలు పని మిగిలిపోయింది. మూడు వేల ఎకరాలకు నీరు అందించాలి. మధ్యలోనే నిలిచిపోయింది. జూనియర్ కాలేజ్ కావాలి.
  • ఉపాధి హామీ పనులు వ్యవసాయం అనుబంధం చేయాలి.

మెంటాడ మండలంలోని గ్రామాలు

  • తిమురువలస
  • కూనేరు
  • ఉద్దంగి
  • పోరంలోవ
  • పులిగుమ్మి
  • కుంతినవలస
  • చినమేడపల్లి
  • పెదమేడపల్లి
  • పోరం
  • బుచ్చిరాజుపేట
  • శీలవలస
  • కొండలింగాలవలస
  • గాజంగుడ్డివలస
  • మిర్తివలస
  • నిక్కలవలస
  • లోతుగెడ్డ
  • వంకసోమిడి
  • ఆండ్ర
  • జయతి
  • ఇప్పలవలస
  • జక్కువ
  • గుర్రమ్మ వలస
  • పెదచామలపల్లి
  • బడెవలస
  • రబంద
  • మీసాలపెట
  • కొంపంగి
  • ఇద్దనవలస
  • చల్లపేట
  • ఖాయిలం
  • అమరాయవలస
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి