ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

సబ్బవరం మండలం

సబ్బవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము. ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 67,334 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 34,072, ఆడవారి సంఖ్య 33,262. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 55.46% ఇందులో పురుషులు 68.91% మంది మరియు స్త్రీలు 41.49%.

నీటిపారుదల సౌకర్యాలు

సబ్బవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

బావులు/బోరు బావులు: 132 హెక్టార్లు* చెరువులు: 202 హెక్టార్లు

ఈ పట్టణ సమస్యలు:

  • అయ్యన్నపాలెం భూదేవి చెరువుపై రిజర్వాయిర్ నిర్మాణం కోసం నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసారు. (సుజల స్రవంతి కోసం) ఆరు గ్రామాలలో  300 ఎకరాలకు నీరు అందుతుంది. ప్రస్తుతం ఎస్టీపీపీ నిధులతో పనులు జరుగుతున్నాయి.
  • విజయరామసాగర్: మల్లరేగులపాలెంలో రూ. 2.5 కోట్ల అంచనాతో జలాశయం నిర్మించ తలపెట్టారు. నల్లరేగటిపాలెం, బలజపాలెం, మారపాలు ఈ మూడు గ్రామాలకు చెందిన 120 ఎకరాలకు నీరు అందుతుంది. పది ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. తాగునీటి సమస్య అధికం. రెండు పూట్ల నీరు ఇవ్వాలి (మేహాద్రిగెడ్డ నీరు వస్తుంది) అనకాపల్లి  ఆనందపురం రహదారి ఎన్ హెచ్ 5 ఆరు లైన్ల రోడ్డు గా విస్తరించాలి. రహదారి విస్తరణ లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
  • రైవాడ కాలువ వస్తే మూడు మండలాలకు నీరు అందుతుంది.
  • బి.యస్. రోడ్డు (భీమిలి నర్సీపట్నం రోడ్డు) నాలుగు లైన్లు చెయ్యాలి.
  • భూదాన బోర్డుకు చెందిన 600 ఎకరాలు భూములు అన్యాక్రాంతమయ్యాయి
  • దేవీపురం, దొంగలమర్రి, సీతారామపురం ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా వృద్ధి చెయ్యాలి 30 పడకల ఆసుపత్రిని డీ గ్రేడ్ చెయ్యడం దారుణం. తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావాలి.
  • భూ కబ్జాలు అధికం
  • 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 600 మంది నిరుపేదలకు పక్కా ఇల్లు మంజూరు చేయాలి.
  • ఎడ్యుకేషన్ హబ్: ఏపీ లా యూనివర్సిటీ (పనులు జరుగుతున్నాయి). మారిటైమ్ యూనివర్సిటీ (శంకుస్తాపన అయ్యింది). పెట్రోలియం యూనివర్సిటీ (మంజూరయ్యింది). టెక్నికల్ యూనివర్సిటీ త్వరితగతిన పూర్తి చెయ్యాలి.
పెందుర్తి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి