చిలకలూరిపేట, గుంటూరు జిల్లాలో నాలుగవ అతిపెద్ద పట్టణం. రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రంగా పేరొందింది ఈ ప్రాంతం. ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 201214 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 103523 కాగా మగవారి సంఖ్య 97675.
బ్రిటిషు వారు దీనిని చిక్పేట అని పిలిచే వారు. ఇక్కడి పండ్ల తోటల వలన చిలుకలు ఎక్కువగా వచ్చేవి, అందుచేత దీనిని చిలకలూరు అని జమీందార్ల కాలంలో అనేవారు. జిల్లాలో మొదటిసారిగా పరిశ్రమలు ఏర్పాటు అయింది ఈ నియోజకవర్గంలోనే. రాష్ట్రంలో తొలి ఎత్తి పోతల పథకం ప్రారంభించింది ఈ ప్రాంతంలోనే. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పత్తి మరియు మిర్చి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు.
శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయం, కోటప్పకొండ మరియు క్లాక్ టవర్.
చిలకలూరిపేట, ఎందరో గొప్ప వ్యక్తులను దేశానికి అందించింది. మరెందరో ఈ పట్టణంతో సంబంధం కలిగి ఉన్నారు. ఆచార్య రంగా, కాసు బ్రహ్మానంద రెడ్డి మొదలైనవారు పేటతో అనుబంధం ఉన్న వ్యక్తులు.