ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మందస మండలం

మండల ముఖ్యకేంద్రం మందస. మందస చారిత్రక పట్టణం. ఇక్కడ ఉన్న పురాతన వాసుదేవాలయం, రాజా వారి కోట, ప్రక్కనే ఉన్న చిట్టడవి, అడవిలో ఉన్న అమ్మవారి గుడి చూడతగినవి. మందస మండలంలోని మహేంద్రగిరి వద్దగల గుహాసముదాయంలో చూడదగినది పాండవులగుహ. ఇక్కడే పాండవులు చాలాకాలం అజ్ఞాతం చేసినారని చెపుతారు. ఇక్కడే గల వాసుదేవ ఆలయంలో మరియు ప్రక్కన గల శివాలయంలోనూ శివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవం జరుగును.

మందస, శ్రీకాకుళం జిల్లా, మందస మండల కేంద్రము. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం, ఈ మండలం 20596 ఇళ్లతో, 82699 జనాభాతో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 40252, ఆడవారి సంఖ్య 42447. ఈ గ్రామానికి పూర్వ నామం మంజూష. మంజూష మంటే సంస్కృతంలో నగల పెట్టె అని అర్థం. అనేకమైన నీటి వనరులతో సస్యశ్యామల మైన ఈ ప్రాంతం 800 ఏళ్ళ నుండి మందస సంస్థానానికి ముఖ్య పట్టణం. ఇక్కడి మందస రాజావారి కోట, 700 సంవత్సరాల పురాతన వాసుదేవ స్వామి ఆలయం, పర్యాటకపరంగా ప్రాధాన్యత ఉన్నాయి. గ్రామంలో ఇంకా బొట్టేశ్వరాలయం, జగన్నాధస్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం, చండేశ్వరాలయం, గ్రామదేవత అన్నపూర్ణ ఆలయం వంటి పురాతన ఆలయాలు 20 వరకు ఉన్నాయి.ప్రసిద్ధ మహేంద్ర గిరి యాత్ర ప్రతి శివరాత్రికి ఇక్కడినుంచే ప్రారంభం అవుతుంది

సమస్యలు

  • పది గిరిజన పంచాయితీలలోని 63 గిరిజన గ్రామాలను నోటిఫైయిడ్ గా గుర్తించాలి.దేవీపురం వద్ద దామోదరసాగరం రిజర్వాయర్  ను 2004లో ఆరు కోట్లతో నిర్మించారు.
  • కుడి, ఎడవ కాలువలు లేవు. కాల్వలు నిర్మిస్తే 1200 ఆయకట్టు సహా మరికొన్ని ఎకరాలకు నీరు లభిస్తుంది.
  • గోపాలసాయి  గిరిజన గ్రామం వద్ద 1985లో నిర్మించిన డబారుసింగి రిజర్వాయర్ కు కుడి కాలువ లేదు. ఇది నిర్మిస్తే గిరిజన భూములకు సాగు నీరు లభిస్తుంద.
  • నక్కయాట వద్ద  రిజర్వాయర్ నిర్మాణానికి 2006లో ప్రతిపాదనలు తయారు చేశారు.
  • రిజర్వాయర్ నిర్మిస్తే 12000 ఎకరాలకు సాగు నీరు అందుతుంది.
  • 12 సునా ముది (బంగారు నదులు) ప్రధాన కాలువలు ఉన్నాయి. మరమ్మతులు చేస్తే పుష్కలంగా నీరు ఉంటుంది జిడిమి, జంతికొండ వద్ద రిజర్వాయర్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇది పూర్తయితే ఉద్దానం ప్రాంతానికి 800 ఎకరాల సాగునీరు, తాగు నీరు అందుతుంది.
పలాస నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి