శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము శ్రీకాళహస్తికి తూర్పున సత్యవేడు నియోజక వర్గానికిసంబంధించిన తంగేళ్లపాళెం, పశ్చిమాన తిరుపతి పట్టణం, ఉత్తరాన నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం, దక్షిణాన కేవీబీపురం మండలాలు మధ్య ఈ నియోజకవర్గం విస్తరించింది.
నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల గుండా స్వర్ణముఖి నది ప్రవహిస్తోంది. నెల్లూరు జిల్లాలో అడుగెట్టి.. అక్కడ నుంచి సముద్రంలో కలుస్తోంది. ప్రధానంగా ఇక్కడ వ్యవసాయాధారిత కుటుంబాలు ఎక్కువ. పాడిపరిశ్రమ ఎక్కువగానే ఉంది. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తెలుగు, తమిళం, ఉర్దూ భాషలు మాట్లాడతారు. రేణిగుంట, శ్రీకాళహస్తి మధ్య అనేక పరిశ్రమలు ఏర్పాటు కావడంతో పారిశ్రామిక రంగంలోనూ అభివృద్ధి చెందుతోంది. బస్సు, రైలు మార్గాలున్నాయి. రేణిగుంటలో జాతీయస్థాయి విమానాశ్రయం వల్ల ఈ నియోజకవర్గానికి మరింత గుర్తింపు వచ్చింది.
టెంపుల్టౌన్ కావడంతో సుదూర ప్రాంతాల నుంచి అశేషంగా జనం ఇక్కడకు తరలివస్తుంటారు. ఈ కారణంగా మంచి వ్యాపార కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది.
శ్రీకాళహస్తి లో (2011) జనాభాత మొత్తం, 57,581. సాంద్రత, 140 / km2 (350 / sq mi). భాషలు. అధికారిక, తెలుగు