ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ఒంగోలు నియోజకవర్గం

పురాతన కలం నుండి ఖ్యాతి కలిగి సుమారు క్రీ.పూ. 230లో మౌర్యులు,శ్రీకృష్ణ దేవరాయలు మరియు 3వ శతాబ్దానికి చెందిన పల్లవులచే పాలింపబడిన ఒంగోలు వివిధ సంస్కృతుల మిశ్రమం అని చెప్పవచ్చు. ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత సంకీర్తన ఆచార్య శ్రీ అన్నమాచార్య యొక్క జన్మస్థలం.ఒంగోలు పేరు వినగానే గుర్తుకు వచ్చేది దేశంలోనే అత్యుత్తమ మేలిరకం గిత్తలుగా ఖ్యాతిని ఆర్జించి ,విశ్వాసానికి మారుపేరుగా,పోరుషానికి ప్రతీకగా నిలిచిన ఒంగోలు గిత్తలు . ఒంగోలు గిత్తలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయి. ఇక్కడ గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు భారీ ఉపాధి వనరును అందిస్తాయి.

నియోజకవర్గంలో మొత్తం 233890మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 114575 మంది పురుషులు కాగా,119289 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

నియోజకవర్గపు ప్రముఖులు:

ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్య మంత్రివర్యులుగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ ప్రాంతానికి చెందిన వారే .

పంటలు

పాల ఉత్పత్తులు ,పప్పులు, పొగాకు ,మిరియాలు  ,ధాన్యాలను ఇక్కడ ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు.

ప్రసిద్ధ ప్రదేశాలు

అద్భుతమైన బీచ్లు మరియు ప్రాచీన దేవలయాలను కలిగి ఉన్న నియోజకవర్గంలో ప్రముఖంగా కొత్తపట్నం బీచ్, 13 శతాబ్దం లో నిర్మించిన చెన్నకేశవ ఆలయం ,కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ,టంగుటూరులో 1116లో నిర్మింపబడిన శివాలయం మరియు చన్నకేశవాలయం ,చందవరం బౌద్ధస్థూపం మరియు  శ్రీ రాజారాజేశ్వరస్వామి ఆలయ సముదాయం, భైరవకోన చూడదగ్గ ప్రదేశాలు .

నియోజవర్గపు సమస్యలు:

  • మనుగడకోసం పోరాటం చేస్తున్న ఒంగోలు గిత్తలు
  • తరాలు మారిన ,మారని సాగు మరియు తాగునీటి కరువు. ఉన్న కాస్తనీరు ప్లోరైడ్ నీరే .
  • సరిపోని సాగర్ నీళ్లు ,వర్షాధారంపై ఆధారపడడంతో మెట్టభూములుగా మారిన వ్యవసాయభూములు.
  • ఇకటికే ఒకకొల్లికి రాణి వెలిగొండ,గుండ్లకొమ్మ ప్రాజెక్ట్ .
Top