ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మార్కాపురం నియోజకవర్గం

చుట్టూ నల్లమల్ల కొండలతో గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతమైన  మార్కాపురం విజయనగర రాజులచే పాలించబడిన ప్రాంతం, ప్రాంతంలో విష్ణువు రాక్షసుడైన కేసిని హతమార్చాడు .

నియోజకవర్గంలో మొత్తం 199162మంది ఓటర్లు ఉండగా ,వీరిలో 100520  మంది పురుషులు ఉండగా, 98619 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

మార్కాపురం మట్టి పలక ప్రపంచానికి లు నేర్పించింది ,ఇక్కడి నుండి సింగపూరు ,జపానుతో పాటు ప్రపంచం నలుమూలలకు పలకలు తరలించేవారు. ఇక్కడ 200 పలకల గనులు 300 తయారీ ఫ్యాక్టరీలు ఉండేవి .

నియోజకవర్గపు ప్రముఖులు:

స్వాతంత్య సమరయోధులు మరియు శాసనసభ సభ్యులు అయిన కందుల ఓబుల్ రెడ్డి ప్రాంతం వారే.

ప్రసిద్ధ ప్రదేశాలు:

విజయనగర శైలి లో నిర్మించబడిన చెన్నకేశవ స్వామి ఆలయంతో పాటు కొన్నిదేవాలయాలు  చూడదగ్గ ప్రదేశాలు.

పంటలు

తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు,మరియు ఉద్యానవన పంటలు ఎక్కువ సాగులో ఉండగా పత్తి మరియు చెరుకు ప్రధాన వాణిజ్య పంటలుగా ఉన్నాయి.

నియోజవర్గపు సమస్యలు:

  • ప్రస్తుతం పలకల  వినియోగం తగ్గడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి .
  • కనీస వసతులు లేక ఖాళీగా పడి ఉన్న ఇందిర్మమ్మ ఇళ్ళు .
  • సాగు మరియు తాగునీటి సమస్య అధికంగా  ఉంది.
  • సాగర్ నీరు రాకుంటే నియోజకవర్గం మొత్తం గొంతు ఎండాల్సిందే
  • ఏళ్ళు గడిచిన పూర్తికాని వెలుగొండ ప్రాజెక్ట్ .
  • నిర్వాసితులకు ఇంకా న్యాయం జరగలేదు .
  • అధ్వానంగా ఉన్న మురుగునీటి వ్యవస్థ .
  • కాలువలు దాటేందుకు వంతెనలు కూడా లేని పరిస్థితి.
Top