ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మైలవరం నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో మైలవరం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 234025 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 116819 కాగా ఆడవారి సంఖ్య 117198.

దర్శనీయ ప్రదేశాలలు

శ్రీ కోట మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక కోట వెనుకన ఉన్న ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-17, ఆదివారం నాడు శ్రావణమాసం సందర్భంగా, జలాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం ద్వారకా తిరుమల దత్తత దేవాలయం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిరవ్హించెదరు.

శ్రీ కంచి కామాక్షి సమేత శ్రీ ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయం.

శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక నూజివీడు రహదారిపై ఉన్న ఈ ఆలయం, ద్వారకాతిరుమల దేవాలయానికి దత్తత దేవాలయం. ప్రతి సంవతరం ఈ ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఆలయంలో గత 23 సంవత్సరాలుగా హనుమద్దీక్షాధారణ పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించుచున్నారు.

నియోజకవర్గంలోని మండలాలు

  • ఇబ్రహీంపట్నం
  • జి.కొండూరు
  • మైలవరం
  • రెడ్డిగూడెం
  • విజయవాడ గ్రామీణ మండలంలోని కొన్ని గ్రామాలు

ఈ నియోజవర్గపు సమస్యలు:

  • డ్రైనేజి వ్యవస్థ బాగులేకమురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.
  • తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.
  • ఆధునీకరించని రహదారులు
  • నియోజకవర్గంలో సరైన విద్య, వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. 
Top