ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

తాడేపల్లిగూడెం నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ అన్నపూర్ణ గాను,ప్రముఖ విద్యాసంస్థలకు  ప్రసిద్ది చెందింది తాడేపల్లిగూడెం. 1955లో ఏర్పడిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ,పశ్చిమ గోదావరి జిల్లాలోని వాణిజ్య కేంద్రాలలో ముఖ్యమైనది , కానీ స్థానికులు మాత్రం దుమ్ము గూడెం,దోమల గూడెం అని పిలుస్తున్నారు.తాడేపల్లిగూడెం ఇక్కడి బియ్యం సాగు మరియు బెల్లం మార్కెట్ మరియు గోదాములకు (గిడ్డంగులు) ప్రసిద్ది చెందింది. ప్రస్తుతం వాడుకలోలేని  తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయంను  రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సైనిక విమానాలను వసూలు చేయుటకు బ్రిటీష్ వారు నిర్మించారు.

ఈ నియోజకవర్గంలో మొత్తం 193025 మంది ఓటర్లు ఉండగా,వీరిలో 94765 మంది పురుషులు,98250 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

పంటలు

ప్రధాన పంటలుగా అరటి ,వరి, చెరకు, వేరుశెనగ,మొక్కజొన్నతో పాటు చక్కెర వంటి ఇతర ఉత్పత్తులను కలిగి ఉంది. పర్యాటక ప్రదేశాలు

నీలద్రిపురంలోని స్వయంభు శ్రీ షిరిడి  సాయిబాబా మందిరం,ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి),శ్రీ కన్యక పరమేశ్వరి  క్షేత్రం,పాపికొండలు ,కొల్లెరు సరస్సు ,గుణపుడిలోని పంచమరాలలో ఉన్న భీమవరం శివాలయం,గోదావరి నది ఒడ్డున పట్టిసీమ శివాలయం,బుద్ధ గుహలు, జీలకర్ర గూడెం ,జగన్నాధపురం మరియు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం పర్యాటకంగా,ఆధ్యాత్మికంగా చూడదగ్గ ప్రదేశాలు.

నియోజవర్గపు సమస్యలు:

  • అగమ్యగోచరంగా నిట్ పరిస్థితి ,వసతులు లేక విద్యార్థులు అవస్థలు.
  • యర్రకాలువ వరదలతో  నిత్యం భయబ్రాంతులకు లోనవుతున్న ప్రజలు.
  • గుంతలున్న రహదారులతో ప్రజలు ముప్పతిప్పలు పడుతున్నారు.
  • ఎప్పుడు కూలుతుందో తెలియని భవనంలో డిగ్రీ కాలేజీ.
Top