ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కడప నియోజకవర్గం

కడప ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ ప్రాంతములోని నగరము. వైఎస్ఆర్ జిల్లాకు ముఖ్యపట్టణము. 1955 లో కడప  నియోజకవర్గం ఏర్పడినది.

నగరానికి రెండు వైపులా నల్లమల అడవులు ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు. తిరుమల వెంకటేశ్వర స్వామికి గడప కావటంతో దీనికి పేరు సిద్ధించింది.

కడపలో ముంబై చెన్నై రైల్వే లైన్ ఇది చాల పురాతనమైనది అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కడప బెంగళూర్ రైల్వే లైన్ ఉన్నాయ్ ఇది పెళ్ళిమర్రి వరకు పూర్తి అయింది . కడపలో కర్నూలు రాణిపేట లను కలిపే 40 జాతీయ రహదారి మరియు చెన్నై ముంబై లను 716 జాతీయ రహదారి వయా పుత్తూరు, రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, బళ్ళారి, ముంబై రహదారి  మరియు కడప బెంగళూర్ 340 జాతీయ రహదారి వయా రాయచోటిి, మదనపల్లె, బెంగళూరు రహదారి మరియు కడప విజయవాడ హైవే వయా మైదుకూరు, పొరుమామిళ్ళ, ంభ, మార్కాపురం, గుంటూరు, విజయవాడ, హైవే మరియు కడప పులివెందుల హైవే, కడప బద్వేల్ నెల్లూరు హైవేలు కడప లో ఉన్నాయి.

జనాభా

కడప నగరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సెన్సస్ ఇండియా యొక్క తాత్కాలిక నివేదికల ప్రకారం, 2011 లో కడప జనాభా 343,054; ఇందులో పురుష మరియు స్త్రీలు వరుసగా 172,357 మరియు 170,697 ఉన్నాయి.

సమస్యలు 

  • పారిశుధ్యం, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలి
  • నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి
  • రిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి చేయాలి
  • నగర శివార్లలో సెజ్ లు  ఏర్పాటు చేసినప్పటికీ అందులో పరిశ్రమలు లేవు
  • ఎయిర్ పోర్ట్ కు  సరైన కనెక్టువిటీ లేదు 
Top