ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

గోకర్ణపురం పంచాయతీ

గోకర్ణపురం శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కంచిలి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఇచ్ఛాపురం నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 573 ఇళ్లతో, 2263 జనాభాతో 258 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1122, ఆడవారి సంఖ్య 1141. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 193 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కంచిలిలోను, ఇంజనీరింగ్ కళాశాల పలాసలోనూ ఉన్నాయి. గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గోకర్ణపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 27 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 2 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 228 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 50 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 177 హెక్టార్లు

ప్రధాన పంటలు: వరి, పెసర

ఉత్తరాంధ్రను వణికిస్తున్న ‘టిట్లీ’ తుపాను శ్రీకాకుళం జిల్లాలో పెను విధ్వంసం సృష్టించింది. దాదాపు పన్నెండు గంటలపాటు ఏకధాటిగా విలయతాండవం చేసిన తిత్లీ దెబ్బకు జిల్లా అతలాకుతలమైంది. శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా ప్రాణాలు గుప్పిట పెట్టుకుని గజగజ వణికిపోయారు. గోకర్ణపురంలో దాదాపు 24సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. అన్నదాతను తిత్లీ తుపాను నిండా ముంచేసింది. గంటల వ్యవధిలో వెన్ను విరిచేసింది. అపార పంటనష్టం కలిగించి రైతన్నకు తీరని కడుపుకోత మిగిల్చింది. భీకర గాలులు, కుండపోతవర్షానికి గోకర్ణపురం పంచాయతీలో సుమారు 20 ఇళ్లు నష్టపోయాయి మరియు గ్రామంలో పలువురి పాడిరైతులకు చెందిన పశువులు, షెడ్లు నేలకోరగడంతోను, కరెంట్ స్థంభాలు కూలిపోవడంతో మృతి చెందాయి. మరియు గ్రామంలో జీడి తోటలకు భారీ నష్టం ఏర్పడింది.

ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి