ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మెట్టవలస పంచాయితీ

మెట్టవలస, విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలానికి చెందిన గ్రామము . ఇది ఆంధ్ర ప్రాంతాలకు చెందినది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ విజయనగరం నుండి ఉత్తర దిశగా 57 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ ప్రాంతంలో "మెట్టవలస పీచూ" అను పేరు గల మామిడి విరివిగా లభిస్తుంది. ఈ మామిడి చాలా సుందరమైనది, ఒకసారి దానిని రుచి చూసేవాడు తన జీవితకాలంలో మరచిపోడు అని అంటారు .

మెట్టవలస చుట్టుపక్కల దక్షిణాన రామభద్రాపురం, తూర్పున బాడంగి మరియు  ఉత్తరం వైపు మక్కువ, సీతానగరం  మండలాలు ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ పంచాయతీ 864 ఇళ్లతో, 3748 జనాభాతో విస్తరించి ఉంది. అందులో ఆడవారి సంఖ్య 1824, మగవారి సంఖ్య 1924.ఈ పంచాయితీలో అక్షరాస్యత 58.21 శాతంగా నమోదయింది. అందులో ఆడవారి అక్షరాస్యత 47.07 శాతంగా ఉంటె మగవారి అక్షరాస్యత 68.89 శాతంగా ఉంది.

భారత రాజ్యాంగం మరియు పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం, మెట్టవలసలో సర్పంచి  గ్రామ ప్రతినిధిగా ఎన్నుకోబడతాడు.

విద్యా సౌకర్యాలు

ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉంది. ప్రభుత్వ వికలాంగ పాఠశాలలు విజయనగరంలో ఉన్నాయి. ప్రైవేటు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల మరియు ప్రభుత్వ ఐ.టి.ఎ. కాలేజీ ఉన్నాయి బొబ్బిలి లో ఉన్నాయి. ప్రైవేట్ MBA కళాశాల పిరిడిలో ఉంది. మరియు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నెల్లిమర్లలో ఉంది. పాలిటెక్నిక్ కళాశాల కోమటిపల్లిలో ఉంది.

 వైద్య సౌకర్యాలు

ఈ పంచాయితీలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో ఉంది.

వ్యవసాయం

వేసవిలో 7 గంటలు వ్యవసాయ విద్యుత్ సరఫరా మరియు సీతాకాలంలో 9 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా ఈ గ్రామంలో అందుబాటులో ఉంది.

బొబ్బిలి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి